Friday, July 10, 2015

నీవు నిష్క్రమించేసమయానికి నా నడినెత్తిమీదికి సూరీడొచ్చి
నాట్యంచేయడం ఆరంభించాడు.
మధ్యందిన మార్తాండుడు గదా ఉగ్రరూపందాల్చి జనం  మొహాలనన్నింటినీ
ఎండతీవ్రతతో  మాడ్చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
పనంతటినీ పూర్తిచేసుకుని ముదు ప్రాగణంలో విశ్రాతి తీసుకుంటున్నాను నీవు వెళ్ళే సమయానికి .

దూరంగా పంటచేలమీదనుంచి వీచే పైరగాలులు
సుతిమెత్తగా తూర్పారబట్టినప్పుడు ఎగిరిపడుతూ వచ్చే గింజల్లా
విచ్చేసి పరిమళాలను పంచేసి తిరుగుముఖం పట్టి వెళుతున్నాయ్

పావురాళ్ళేమో నీడపట్టుకు చేరుకుని క్లుప్తంగా కూనిరాగాలనందుకుంటున్నాయ్
ఇంతలో తేనెటీగ గబగబా నాగదిలోకిదూరి
పంటపొలాలమీదనుంచి ఏవో తాజా వార్తలను తీరిగ్గా మోసుకొచ్చి అందిస్తున్నది.
మొత్తం గ్రామం గ్రామమంతా ఎండ ధాటికి తట్టుకోలేక
ఇళ్ళలోనే తలదాచుకుని సేదతీరుతున్నాయ్ .
వీధులన్నీ అప్పుడే వూడ్చేసినట్లు నిర్మానుష్యంగా మారిపోయాయి.
మధ్యమధ్యలో అర్ధాంతరంగా ఆకులు గలగలలతో ఆనంద వాహినులై విహరిస్తూ
 కాలక్రమేణా సద్దుమణగడం మొదలెట్టాయ్.
ఆకాశంవైపునేను దృష్టినిసారిస్తే నీలిమబ్బులపైన
నాకుపరిచమైన వ్యక్తిపేరు ప్రకాశిస్తూ దర్శనమిచ్చింది.
అది అందమైన నాదస్తూరీతోనే లిఖించబడ్డదని ఆలస్యంగా గ్రహించాను.

గ్రామం గ్రామమంతా ఎండధాటికి తాళలేక ఇంట్లోనే తలుపులు బిడాయించుకుని సేదతీరుతున్నాయ్.

అయ్యయ్యో !! నాకేశసంపదకు తైల సంస్కారం చేసి దువ్వుకోవడమే మర్చిపోయాను.
పిల్లగాలులు వాటిలోకొన్ని కేశాలను నా చెంపలమీదకు చిలిపిగా నెట్టేసి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయ్.

[రవీంద్రుని తోటమాలి[The Gardener ] 55 వ గీతానికి స్వేచ్చానువాదం ]
37
నాగళసీమను పుష్ప మాలాకృతురాలినిచేసి
గౌరవార్హం చేయడం సబబేనా అని ఒక్కసారి ఆలోచించు!!.

నేను భక్తిపురస్సరంగా అల్లిన ఈ సుమాల మాలలు
యే ఒక్కరికో పరిమితంచేయడం భావ్యం కాదని నా భావన.
నాకళ్ళల్లో అనునిత్యం తారసపడే జీవులెందరున్నారో తెలుసా?
ఇప్పడిదాకా దున్ని సాగుచేయబడని క్షేత్రాల్లో
ఆశావహులై శ్రమకోర్చి స్వేదఫలాననందుకోవాలని తపన పడుతున్న
ఎందరో సాగుబడిదారులు దారులు వెదుక్కుంటూ జీవిస్తున్నారు.
అంతేకాదు భావకవుల ఊహాలోకాల్లో విహరిస్తూన్న
సౌందర్య లలామలెందరో  ప్రేమ సాక్షాత్కారంకోసం
 ఆవిష్కృత హృదయ వాసులై ఎందరో నిరీ క్షిస్తున్నారు
నీవే  జబాబుచెప్పమని నాహృదయాన్ని అడిగేసమయం మించిపోయింది.
అప్పట్లో వికసితంగాని  మొగ్గగా పడివున్న  నాజీవితం
అంతరాంతరాళాల్లో పరిమళాన్నంతటినీ గుంభనంగానూ   భద్రంగానూ  దాచుకున్నది.
ఇప్పుడదే తన హృదయ వైశాల్యాన్ని బహుదా విస్తరించి వున్నది.
ఎవ్వరు ఈ ఆనందాన్ని ఊహించి సత్వరం గ్రహించి దాచుకోగలరు?
ఇది ఎప్పుడు అకస్మాత్తుగా అదృశ్యమౌతుందో ఎవ్వరికెరుక?
నాహృదయం యే ఒక్కరికో సమర్పించడానికి పరిమితంకాలేదని
గ్రహించు.
అది ఎందరికో ఆనంద వార్ధిగా సుఖ సంతోషాలను పంచుతుండాలని నా ఆకాంక్ష.

[టాగోర్ తోటమాలి[ఠె గర్దెనెర్ ]37 వ గీతానికి స్వేచ్చానువాదం ]

Thursday, June 18, 2015

బుచ్చిబాబు ఒకే ఒక  నవల=

రాసిన ఒకే ఒక  నవలలద్వారా ప్రముఖ రరచయితలలో అగ్రశ్రేణినందుకుని ఆ స్థానాన్ని అనితరసాధ్యంగా పదికాలాలపాటుష్థిరంగా నిలుపుకున్న నవలాకారుడు
కీ.శే/ శివరాజు వెంకటసుబ్బారావు గా,కాక కేవలం బుచ్చిబాబుగా పేర్వడసిన ప్రముఖుడు.

జీవితంలో నిశితమైన పరిశీలనా,సౌంద ర్యo   కలబోసుకున్న మూర్తిమంతమయిన మనీషి మన బుచ్చిబాబు.
చక్కని మనస్తత్వ పరిశీలనకు విశిష్టమైన విశ్లేషణా విన్నాణ్ణానికి స్ఫురద్రూపమైన కిరణంగా  బుచ్చిబాబు మనకు కళ్ళెదుట సాక్షాత్కరిస్తాడు.

ఒకసారి చదవగానే ఇట్టే అర్ధమవకపోగా మళ్ళీ మళ్ళీ చదువుతున్న కొద్దీ మరీ మరీ చదవాలనిపించే సజీవ పాత్రల రూపకల్పనతో  సూదంటురాయిని బోలిన కధనం ఈ నవలేతివృత్తం ,చదువురులను ఇట్టే  కట్టిపడేసేరూపకల్పన ఇందులోమనం గౌరవించదగిన పరిణామం.

ఇందులో కధానాయకుడనదగిన దయానిధి పాత్ర మనకు విచిత్రంగా కనిపిస్తూ పరిశోధన చేయదగిన విషయ వివేచన గలది.తల్లి మీద దయానిధి అవ్యాజానురాగం.అశేషమైన అనురాగం,అద్వితీయమైన్ ప్రేమ.కానీ తల్లి హీనచరితయని గ్రహించాక తల్లిని ద్వేషించకుండా నిబ్బరించుకోలేకపోతాడు.అయినా ప్రత్యక్షంగా ప్రేమ భావాలను ప్రకటించకుండా

ఉండలేకపోతాడు.  కానీ ఆప్రేమలోని బెరుకుతనాన్ని ఎంతకీ సమన్వయంచేసుకోలేక గిల గిలలాడిపోతూ వుంటాడు.తన తల్లిని తన జీవితకాలంలోఎవరు   ఎద్దేవచేసినా,వాళ్ళపై కసినీ పగనూ ద్వేషాన్ని తగ్గించుకోలేక పోతూ సతమతమై పోతాడు.

జెరెసొప్పా జలపాతాలూ ,హిమాలయా పర్వతాలూ,  సింధు భాగీరధీనదులు వీటికిమల్లే తల్లి ఎప్పుడూ తనదగ్గరే ఉండిపోవాలనుకుంటాడు .తల్లికి ఫిట్స్ వచ్చే జబ్బు వుంది.ఆజబ్బును
తను స్వయంగా నయంచేయాలన్న తలంపుతో పట్టుదలతో దీక్షగా
మెడిసిన్ లోచేరి శ్రద్ధగా చదూతాడు. తన చదువు పూర్తయి ఓకొలిక్కి రాకముందే అమ్మను శాశ్వతంగాకోల్పోతాడు.కృంగిపోతాడు.

తరువాత అనాసక్తి అనడంకన్నా అర్ధాసక్తితోవైద్య వృత్తిని రాయలసీమలో కొనసాగించాలని తీర్మానించుకుంటాడు. వైద్యవృత్తిలోసఫలీకృతుడుకాలేక సతమత మవుతూ వుంటాడు.కట్కపోతాడు.జెరెసొప్పా,నయాగరా,సింద్ఘు,భాగీరధీ నదులవోలె అమ్మగూడా
శాశ్వతత్వాన్ని అంతరించుకుంటుందని అంధవిశ్వాసం కలిగివుంటాడు.
తల్లికి ఫిట్స్ వచ్చే జబ్బు వుండెది.తను స్వయంగా డాక్టరై ఆజబ్బును అతి శీఘ్రంగా నయంచేయాలని భావిస్తాడు.
అతని చదువుపూర్తిగాకముందే అమ్మ దూరమతుంది.తన దృష్టానికి తానే వగచి కృంగిపోతాడు.

ఆతర్వాత అర్ధాసక్తితోనే వైద్య వృత్తిని చేయాలని రాయలసీమ ప్రాంతానికి తరలివెళతాడు.అక్కడా మనసును వృత్తిమీద లగ్నంచేయలేకపోతాడు.సఫలీకృతుడుకాలేక బాధపడతాడు.
దయానిధికి ఆ తర్వాత దొరికిన వజ్రం ద్వారా గని యజమాని అవతారమెత్తుతాడు.కార్మికులతో ఘర్షణ ప్రారంభమవుతుంది.ఆసందర్భంగా వాళ్ళు తన వ్యక్తిత్వాన్నీ,అమ్మ గతాన్ని అవహేళనగా మాట్లాడితే మ్రాంపడిపోతాడు.
ఇందిరను వివాహం చేసుకున్నా ఆమెతో సంసార జీవనాన్ని సజావుగా సాగించలేకపోతాడు.తన తల్లిమీద ఇందిర వ్యతిర్క భావాలు ప్రకటించగా అనుమానిచీ, అవమానించీ ఆమెకు దూరంగా మసలుతాడు.

దయానిఢి జీవితాన్ని సంపూర్ణంగా ప్రభావితంజేయగలిగేలా ప్రవర్తించిన స్త్రీ అమృతం. వరుసకు మరదలు వరుస గావడంతో కొద్దిగా చనువు అధికమయిందనే చెప్పుకోవాలి.ఆమెలోని సహజత్వం,చనువు అతనిని విపరీతంగా కట్టిపడేస్తాయి.



తను మనసారా కోరుకున్న మహిళ కోమలి.కానీ ఆమె దయానిధికి అందకుండా దూరం దూరంగా జరిగిపోతుంటుంది.వేశ్యకూతురయినా సుఖాన్ని మరోకరితో పంచుకోని అనాఘ్రాత పుష్పం కోమలి.

తను కోరుకున్న కోమలి తనను తప్పించుకుంటూ తిరుగుతూండడం,ఇందిరతో తనకు శారీరక  సంబంధ మంటేనే వెగటు పుడుతూండడంతో,అతన్ని పూర్తిగా అమృతానికి చేరువగా చేరుస్తుంది.
"పావనివి  అచ్చం  బావపోలికలే గదా"!అని అమృతం వాళ్ళత్తగారితో అంటుండగానే నిగూఢంగానిలిచిపోతుందని దయానిధి భావించిన రహస్యాన్ని  అత్తగారి ఎదుటనే బట్ట బయలు చేస్తుంది..ఇక అమృతం తనకే పరిమితమైపోతుందని భావిస్తాడు.ఆఆశోహతుడౌతాడు.తన ఊహలకు రూపాన్నివ్వాలన్న   తపనను మాను కుని వాస్తవజగత్తులోకి అడుగుపెడతాడు.దయానిధి.

తనకోసం తన ప్రేమకొసం తనను వెదుక్కుంటూ వచ్చిన కోమలిని చేరదీస్తాడు.జబ్బుతో మరణించిన ఇందిర స్థానంలో తన భార్యగా స్వీకరిస్తాడు.


ఇలా దయానిధి పాత్రచుట్టూమిగతా   పాత్రలు పరిభ్రమిస్తాయి.నవలను చదివినకొద్దీ ఆసాంతం ఏకబిగిన చదివించే ప్రజ్ఞఈ నవల ఇతి వృత్తానికి కలదనుట నిస్సందేహముగా యదార్ధము. చదివిన ప్రతి సారీ కొంగ్రొత్త రుచులనందించే చక్కని చిక్కని కధనం.

ప్రతిపదాన్నీ కవితామయంగా రసోదయం కలిగించేలా బుచ్చిబాబు ఎం తో శ్రమకోర్చి తీర్చిదిద్దిన కధనం.
చక్కని ప్రకృతిపరిశీలకునిగా ముచ్చటైన చిత్రకారునిగా మీదుమిక్కిలి మనస్తత్వ శాస్త్ర విశ్లేషకునిగా ఇతివృత్తాన్ని ఎంపిక చేయడం దగ్గరనుంచి, పాత్రలను ప్రతిభాసమన్వితంగా నడిపించేతీరులోనూ ఎన్నో కొత్తదారులను తొక్కిన ఘనత కూడా బుచ్చిబాబుదే.అది వేనోళ్ళా  ప్రశంసార్హం.
తాను సృష్టించుకున్న సమాజంలో మానవుడు ఎలా ఉన్నాడొ విశ్లెషిమడమే నవలాకారుని ప్రధానమైన ఎత్తుగడ.
బాహ్యజగత్తులో ఎదురయే వ్యతిరేక శక్తులతో ఎలాపోరాడాలో ఎలా సమాధానపడాలో  తన అతరంగ జగత్తులో జరిగే గట్టి ఘర్షణను ఎలా సముదాయించాలో సంగ్రంగా మనకు సూచన ప్రాయంగాందించిన మానసిక విశ్ళేషాణాత్మక నవల ఇది.అని బుచ్చిబాబు ఆల్దుక్ష్ హక్సిలీ గురించి రాస్తూ[భారతి-జనవరి-1964 సంచికలో అన్న మాటలు అతని ఈ నవలకు చక్కగా పొదవిన రత్నాల్లా సరిపోతాయి.

తన శక్తినంతా కూడగట్టుకుని ఎంతో మానసిక బలాన్ని ఖర్చుజేస్తూ ఎన్నో సంవత్సరాలు,సాంకేతిక విషయాలను అద్గ్యయనం చేసి వెలువడిన ఈ నవల చదువరి ఏకాగ్రతతో మనసు పెట్తి చదివితేగాని అంతుబట్టని ఒంటబట్టించుకోలేని నవల ఇది. అందుకేనేమో ఇంతగా శ్రమించి రాసిన నవల కావడంతో మరో నవల సృజించకుండానే బహుధా విభిన్న వర్గాల ద్వారా ప్రశంసలనందుకున్నఅశేష శేముషీ ఖని , బుచ్చిబాబు అనడంలో సందేహానికి తావులేదు.
ను చదివిన పుస్తకం గుడిపాటి వెంకట చలం.’ స్త్రీ ‘
------------------------------------------------------------
విప్లవాత్మకమైనభావాలు గలిగి.వివాదాస్పదమైన రచయితగావిశేష ఖ్యాతినార్జించిన అశేషశేముషీఖని,గుడిపాటి వెంకట చలం. చదువరులనుండి భూషణలు దానికన్న అధికంగా దూషణలనూ సమభావంతో గడుసరిగా స్వీకరించిన ఘటికా వతంసుడూ చలమే.
స్త్రీ జాతి సముద్ధరణకోసం పురుషుడితో సమానంగా స్త్రీ ని గుర్తించి సమాజం తదనుగుణంగా గౌరవించాలని సమున్నతంగా ఆశించిన వ్యక్తి శ్రీ చలం.స్త్రీ తిలోని ఔన్నత్యాన్ని పదె పదే గుర్తుచేస్తూ సమున్నతంగా స్త్రీని శిఖరారోహణం చేయాలని మనసారా భావించి తనరచనలలో
ఉటంకించి న ఘనాపాఠి.
ఎవరెంత ఎదురుచె ప్పినా ఆక్రోశించినా ,తనరచనలను తన వ్యక్తిగత జీవితాన్ని క్రమానుగుణంగామలచుకున్న విశేషమైన ప్రజ్ఞాశాలి శ్రీ చలం.ఎందరికో ఆరాధ్యుడిగా నిలవడం ఆయనలోని ప్రత్యేకమైన ప్రతిభకు సోదాహరణం.
1925లో ప్రప్రధమగా వెలువడి ఆతరువాత అసంఖ్యాకమైన పునర్ముద్రణలకు నోచుకున్న పుస్తకం—చలం ’స్త్రీ "
స్త్రీ" పట్ల ఒక నిర్దిష్టమైన దిశగ, తనసాహితీ మార్గాన్ని సాగించిన శ్రేయోనిధి.చలం.
ఈ పుస్తకాన్ని స్త్రీ జాతికి అంకితమిస్తూ
"నాకు ఒక్క నిముషం -విశ్రాంతినివ్వక మహాప్రణయ మారుతవేగం అగాధ వియోగ భారంక్రిందనో చీల్చి నలిపి ఊపీఅడనీక నాజీవితాన్ని పాలించే స్త్రీ". లోకానికి నివేదితం."
ఈ పుస్తకాన్ని మోహం,పతివ్రత,స్త్రీ నీతి , స్త్రీ సంపాదన బ డి చదువులు, స్త్రీ స్వేచ్చ, ఇలా 38విభా గాలుగా ఈ పుస్తకాన్ని రూపొందించదంజరిగింది.
ఇందులో కుటుంబం సం క్షేమం దృష్ట్యా వేలం వెర్రిగా అర్రులుజాస్తున్న, అమలుజరుపబడుతున్న గర్భ నివృత్తి మార్గాలు-గర్భ స్రావాలూ, బాగోగులూ అంటూ కొన్ని అధ్యాయాలను కూ డా మనం ఈపుస్తకంలోచూ డ వచ్చు.
ఈపుస్తకాన్ని ఈనాటికాల0లో ఎన్నో నిరసనలు ఎదుర్కొ0టూనే ఎందరో కొనుగోలుచేయడం
ఎన్నెన్నో పునర్ముద్రణలకు నోచుకోవడం ఆ శ్చ ర్యాన్ని కలిగిస్తున్నదని చెప్తూ
“అంత సీరియస్గానూ విరుద్ధంగానూ రాసిన నాపుస్తకాన్ని ఆప్యాయంగా ప్రజలు చదివి నాకు ఉత్తరాలు రాస్తున్నా రంటే తెలుగు ప్రజల మెధోశ క్తిమీద జ్ఞాన తృష్ణమీద ఎంతోగౌరవం కలుగవచ్చు.”
కానీ నాకొచ్చే ఉత్తరాలు మూడొంతులు గర్భాస్రావానికి మందో,మార్గమోచూపమని ప్రత్యక్షంగానోపరోక్షంగానో నర్మ గర్భంగానో నన్ను అభ్యర్ధిం చేవే నని విస్మయాన్ని ప్రకటిం చా రు.
స్త్రీ పురుషానుభవం అమూల్యమనీ ,శృంగారపు విలువల్లో తాను జీఇతాన్నెగాక తక్కిన తన సంబంధమైన జీవితాన్ని సుఖప్రదం చెయాలనే దీక్షవున్న వారికోసమె రాసాను అ0టారొకచోట.
స్త్రీల మానసిక ప్రవృత్తిలో మార్పుకోసం పురుషాహంకారాన్ని తగ్గించడంకోసం ఎంతోకృషి చేసాను ,సంఘం తనను వెలివేసిన దృష్టితోనే చూస్తుందని భావించినా వెనుకంజ వేయలేదు.అంటూ తనకు రావాల్సిన హక్కులకన్నా తన చు వున్న వాతావరణంలోంచి కన్నా స్వంతత్రమూ , శాంతీ హృదయంలోపల పలికినప్పుడే స్థిరంగా నిలుస్తామని వివరించాడు.
నవీన స్త్రీలను గురించి చెపుతూ అత్త అధికారాలనుంచి భర్త అధీనం నుంచి తప్పించున్నా మనుకుంటున్న ఆధునిక మహిళ సంఘ గౌరవానికీ ఫాషన్లకూ బానిస అవుతుంది.
ఓ పురుషుని నీడక్రిందనుంచుని ఆపురుడు బానిస అయినాసరే లోకాన్ని ధిక్కరించ గలిగే ఇల్లాలు ఈనాడు సంఘ గౌరవన్ పేర విద్యపేర,ఉద్యోగంపేర ఫాషన్ పేర వెయ్యిమందికి దాస్యం చేస్తుంది.తనచుట్టూ ఉన్న స్త్రీలమ్యా అత్తలై అధికారం చెలాయిస్తున్నారు అని వాపోతారు చలం.
స్త్రీని బానిసను చేసేది లోక భయం . తిరగబడ్డ స్త్రీని సమాజం గౌరవించదలచదు.పైగా అవమానిస్తూ హింసల పాల్జేస్తారు. అందరికీ సంఘం కళ్ళు తెరిచి స్వతంత్ర స్త్రీని గౌరవించడం నేర్చుకోదు. అని హెచ్చరిస్తాడు, చలం.
స్త్రీకి విద్యకన్నా అతిముఖ్యమైనది స్వావ \లంబనాన్ని సంకూర్చగల వ్యక్తిగత సంపాదన,
మనుషుల్నిగానీ దేశాన్నిగానీ అణగదొక్కాలంటే ఆర్ధికంగా అస్థిరపరచడం సులువైన మార్గం.ఆతర్వాత ఆ ఆర్ధిక మూలాలను క్రమేపీ ధ్వసం చేయగలగడం .ఈ అవరోధం వలననే స్త్రీ బానిసగా వేల సంవత్సరాల తరబడి అధోజగత్తులో ఉంటూ అణగ ద్రొక్క బడుతూ ఉన్నది.విద్య ద్వారా స్త్రీలోకం సంపాదనా పరురాలయిందా పురుషాహంకారానికి గండి పడడం ఖాయమే.ఈ పురుషాధికారం నేలకూలడం ఆతర్వాత సంభవించగల పరిణామం. విద్య యేదయినాసరే స్త్రీకి స్వాతంత్ర్యాన్ని సముపార్చిపెట్తలేకపోతే ఆవిద్య వృధా అంటాడు సున్నితంగా చలం.
మగవాడు ఉ త్తమ పురుషుడుగా రూపొందాలంటే తనకొరకు [స్త్రీలకొరకు గాక] , వారికి స్వాతంత్ర్యాన్ని అందించాలి.ఈ స్త్రీలోకాన్ని తర తరాలుగా బానిసలుగా చూసినందువల్లనే ఈ నిరంకుశుడైన మగవాడు అనేక పశుగుణాలను అలవర్చుకున్నాడు.స్త్రీని స్వతంత్రురాలిగా చేయగలిగిననాడు ఆ అవలలక్షణాలన్నీ నశించి ఉత్తమ పురుషుడై వెలుగొందుతాడు.
పిల్లల్ని కనడం, మంచి కూరలను తినడంకన్నా, స్త్రీ ఎక్కువ ఆనందాన్నందిస్తుందన్న విషయం తెలీని పురుషులను సంస్కార విహీనులుగా సౌందర్య పిపాస రహితులుగా వర్గీకరిస్తాడు చలం.
అతిచిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల వచ్చే అనర్ధాలను "దాంపత్య సుఖం" అన్న శీర్షిక క్రింద కూలంకషంగా వివరిస్తాడు.
భార్యనీ పిల్లలనూ పోషించే ఆర్ధిక స్తోమత సముపార్జించేదాకా మగవాడు పెళ్ళిచేసుకోగూడదు. చేసుకు న్నాడా తన భార్యనీ, పిల్లలనీ తన తల్లిదండ్రులనూ బానిసలను చేసి అతినీచమైన స్థితికి దిగజారిపోతాడు. తన ఆదర్శాలు.ఔన్నత్యమూ,అభివృద్ధీ, సంసారంకోసం అనవసర త్యాగంచేసి భ్రష్టుడై మిగిలిపోతాడు.
అని పెళ్ళిచేసుకోదలుచుకున్న మగవాడికి స్వతంత్రమైన సంపాదన ఎంత అవసరమో నిర్మొహమాటంగా వివరిస్తాడు,
స్త్రీ ప్రేమను అభిలషించే పురుషునికి శుభ్రతా, చురుకుదనమూ,అవసరమంటూ లోక జ్ఞానము,పాండిత్యమూ,సాహితీ పిపాసా, ఆమెకోసమన్న తప్పక అలవరచుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తాడు. స్త్రీ బిడ్దలను హక్కు వుందిగానీ సత్సంతానాన్ని కనే బాధ్యతకూడా కలిగివుందన్న సత్యాన్ని వివరిస్తాడు. ఆరోగ్యవంతులనీ శిష్టులనూ కనలేనని తెలిసినప్పుడు తాను పిల్లల్ని కనకూడదు.పిల్లలను ఎంపికచేసుకుని పెంచుకోవడం ద్వారా ఆకోర్కెను నెరవేర్చుకోవడం మేలు అంటారు చలం.
మానవ హృదయాన్ని కదన రంగం చేసుకుని స్త్రీ స్వేచ్చా స్వాతంత్రాలకోసం అవిరళంగా సమరం జరిపిన రచయితగా సమున్నతుడై మన కనుల ముందు సాక్షాత్కరిస్తాడు.ఆయన పుస్తకం ముగింపులో వివరించినట్లుగా
ఈ పుస్త్కం చదివి ప్రజలూ సంఘాలూ చెడిపోతాయని కొందరంటారు.
అలా ప్రజల్నీ సంఘాలనూ పాడుజేయగలిగిన శక్తి నాకున్నదని వారు భావించడం నన్ను అమోఘంగా గౌరవిస్తున్నట్లుగా భావిస్తాను,
కాని నాకు గట్టిగా తెలుసు, ఈపుస్తకం చదివినంత మాత్రాన ఎవరూ చెడిపోర నామాటల్లో పడి వినాశకరమైన వాతావరణాన్ని సృష్టించుకోఫల బుద్ధి హీనులు ఎవ్వరూ ఎక్కడా వుండరని నా ప్రగాఢ వి శ్వాసం .అంటూ ఈపుస్తకాన్ని చలం గౌరవప్రదంగా ముగిస్తారు.
చలం పుస్తకాలు చదవకురా!! చెడిపోతావని పెద్దలు హెచ్చరించిన కాలంలో చదివినా, ఓ మంచి పుస్తకాన్ని చదివానన్న తృప్తికలిగించిన ఉత్తమోత్తమ మైన ర చన అప్పుడప్పు డయినా మరల చదవాలనిపించినపఠనీయ గ్రంధం చలం ' స్త్రీ'
[ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రిక 11-11-1987 నుండి కొద్దిమార్పులతో స్వీకారం]
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------